Sun Dec 14 2025 10:08:06 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : నేడు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పై విచారణ
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పై హత్యాప్రయత్నం చేశారని ఒక కేసు నమోదయింది. మరో కేసు సీఐని హతమార్చేందుకు ప్రయత్నించారని కూడా మరో కేసు నమోదయింది.
మూడు కేసుల్లో...
ఈ రెండు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈవీఎంల ధ్వంసం చేసిన కేసులో ఆయనకు హైకోర్టులో బెయిల్ లభించింది. జూన్ 6వ తేదీ ఉదయం వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఈ మూడు కేసుల్లో ఆయన నిన్న తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా, నేడు విచారణ జరగనుంది.
Next Story

