Fri May 03 2024 09:26:54 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : రాజధానిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి రాజధాని అమరావతి మాత్రమేనని ఆయన అన్నారు. మూడు రాజధానులను తాము ప్రకటించినా అవి న్యాయస్థానాల్లో కేసులు నలుగుతున్నందున ఇప్పటి వరకూ రాజధాని అమరావతిగా మాత్రమే పరిగణిస్తామని తెలిపారు.
న్యాయపరమైన చిక్కులు...
అయితే న్యాయపరమైన చిక్కులు తొలిగిపోయిన వెంటనే మూడు రాజధానుల నిర్మాణం చేపడతామని అంబటి రాంబాబు తెలిపారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతోనే మూడు రాజధానులు సాధ్యం కాలేదన్నారు. త్వరలోనే న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని అంబటి రాంబాబు ఆశాభావం వ్యక్తంచేశారు.
Next Story