Tue Apr 22 2025 02:27:41 GMT+0000 (Coordinated Universal Time)
మెగా డిఎస్సీపై కీలక అప్ డేట్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. గత వైసిపి ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదన్న నారా లోకేశ్ గత 30ఏళ్లలో టిడిపి ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించిందని గుర్తు చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో...
టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశారని, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 నడుమ చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం 2014,18,19లలో మూడు డిఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసిందని నారా లోకేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల వివరాలను సభ ముందుంచారు.
Next Story