Mon Dec 23 2024 07:26:22 GMT+0000 (Coordinated Universal Time)
కందుకూరు ఘటనపై కేసు నమోదు
కందుకూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు కేసు నమోదు చేశారు
![కందుకూరు ఘటనపై కేసు నమోదు కందుకూరు ఘటనపై కేసు నమోదు](https://www.telugupost.com/h-upload/2022/12/29/1452600-kandukur-road-show.webp)
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనిపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
174 సెక్షన్ కింద...
174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకున్న చోట సభను ఏర్పాటు చేయకపోవడం, నిర్వాహకులు ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే మృతుల సంఖ్య ఇంత పెరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story