Sun Dec 14 2025 11:47:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో 24న ఎమ్మెల్సీ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. మార్చి 24వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. మార్చి 24వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మార్చి 7 తేదీన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14 వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 15 వతేదీన ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలస్తారు. 17వ తేదీన ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు.
ఖాళీ అయిన స్థానానికి....
విజయవాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా మరణంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. ముఖ్యమంత్రి జగన్ కరీమున్నీసా కుమారుడికి ఈ సీటు ఇస్తానని చెప్పారు. దీంతో ఈ ఎన్నిక ఏకగీవ్రం కానుంది. శాసనసభ్యుల కోటా కింద జరిగే ఎన్నికలు కావడంతో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే అవకాశం లేదు.
Next Story

