Sun Dec 14 2025 23:29:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పోలింగ్ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు క్యూ లో నిలబడి మరీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు.
ఓటు వేసిన...
చంద్రబాబు పోలింగ్ కేంద్రానికి వచ్చే సరికి అప్పటికే ఓటర్లు అక్కడ బారులు తీరడంతో ఆయన క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కాసేపు వేచి ఉన్న తర్వాత ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణిలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు.
Next Story

