Sun Dec 14 2025 18:03:10 GMT+0000 (Coordinated Universal Time)
కార్తీకమాసం తొలి రోజు కావడంతో?
నేడు కార్తీక మాసం సందర్భంగా శివాలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో సందర్శించుకుంటున్నారు.

నేడు కార్తీక మాసం సందర్భంగా శివాలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో సందర్శించుకుంటున్నారు. నదీ ఘాట్లు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయానికి భక్తులు చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకాలను నిర్వహిస్తున్నారు.
శివాలయాలు కిటకిట...
కార్తీకమాసం తొలిరోజు కావడంతో గోదావరి తీరంలో ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. గొష్పాద క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణంతో ఆలయాలు మార్మోగిపోతున్నాయి. భక్తుల కోసం ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ కృష్ణా నదిలో కూడా భక్తులు స్నానమాచరించి ఆలయాలను దర్శించుకుంటున్నారు.
Next Story

