Fri Mar 28 2025 07:03:37 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులు వీరే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు నియమించారు. ఈరోజు పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు నియమించారు. ఈరోజు పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు జిల్లాల నేతలతో నేడు సమావేశమైన వైఎస్ జగన్ వారితో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షులుగా వీరు కొనసాగుతారని జగన్ చేసిన ప్రతిపాదనలకు నేతలు కూడా అంగీకరించారు.
నియమిస్తూ ఆదేశాలు...
అందులో భాగంగా గుంటూరు జిల్లాకు అంబటి రాంబాబును, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నానిని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ నియమిస్తూ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై మూడు జిల్లాలకు వీరే అధ్యక్షులుగా కొనసాగుతారని పార్టీ అధినాయకత్వం స్పష్టంచేసింది.
Next Story