Mon Dec 15 2025 00:17:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : లండన్ వెళ్లిన జగన్ .. తిరిగి నెలాఖరుకు ఏపీకి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సతీమణి భార్యతో కలసి లండన్ కు బయలుదేరి వెళ్లారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సతీమణి భార్యతో కలసి లండన్ కు బయలుదేరి వెళ్లారు. యూకేలో జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ఫైనాన్స్ లో ఎంఎస్ పూర్తి చేసి నేడు పట్టా అందుకోనుంది. ఈ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరవుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో జగన్ కుటుంబంతో కలసి లండన్ కు బయలుదేరి వెళ్లారు.
ఈ నెలాఖరుకు వచ్చి...
తిరిగి ఆయన ఈ నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర స్థాయి పర్యటనపై క్లారిటీ రానుంది. ఎప్పటి నుంచి ఏ జిల్లా నుంచి ఆయన జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తారన్నది తెలియనుంది. జనవరి మూడో వారంలో జిల్లా పర్యటనలు చేస్తారని జగన్ పర్యటించిన నేపథ్యంలో ఈ నెలలో ఆయన పర్యటన ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
Next Story

