Mon May 20 2024 13:30:33 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీలో పనిచేసే వాతావరణం లేకనే వైసీపీకి రాజీనామా
ఎమ్మిగనూరు లో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మిగనూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడు బుట్టా రంగయ్య వైసీపీికి రాజీనామా చేశారు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మిగనూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడు బుట్టా రంగయ్య వైసీపీికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను జిల్లా పార్టీ నాయకుడికి పంపినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ గా...
గతంలో ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్గా బుట్టా రంగయ్య పనిచేశారు. పార్టీలో పనిచేసే వాతావరణం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నానని తెలిపారు. బుట్టా రేణుక సోదరుడు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని బుట్టా రంగయ్య తెలిపారు. బుట్టా సోదరుడిపై కర్నూలు ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు.
Next Story