Wed Apr 23 2025 22:00:18 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్తు వైర్లు తగిలి ఎనిమిది మంది మరణించిన ఘటన హాజీపూర్ జిల్లాలో జరిగింది

బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్తు వైర్లు తగిలి ఎనిమిది మంది మరణించిన ఘటన బీహార్ లలోని హాజీపూర్ జిల్లాలో జరిగింది. ఒక భక్తుల బృందం వెళుతున్న వాహానికి హై టెన్షన్ విద్యుత్తు వైర్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. సుల్తాన్ పూర్ ప్రాంతంలోని హరిహరనాధ్ ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు మినీ ట్రక్కులో కొందరు బయలుదేరి వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్తు వైర్లు వాహనానికి తగిలి ప్రమాదం జరిగింది.
విద్యుత్తు వైర్లు తగిలి...
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story