Sun Dec 14 2025 06:04:20 GMT+0000 (Coordinated Universal Time)
సిద్దిపేటలో కాల్పుల కలకలం.. 43 లక్షలతో పరారీ
సిద్ధిపేటలో కాల్పుల కలకలం రేగింది. సిద్దిపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు జరిగాయి.

సిద్ధిపేటలో కాల్పుల కలకలం రేగింది. సిద్దిపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు జరిగాయి. ముగ్గురిపై ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజస్ట్రేషన్ కోసం అనేక మంది వచ్చారు. అయితే ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నరసయ్య పంతులు అనే వ్యక్తి 43 లక్షలు తీసుకుని వచ్చాడు. దానిని కారులో ఉంచాడు.
కారులో ఉన్న.....
అయితే దీనిని గమనించిన ఇద్దరు దుండగులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వచ్చి కాల్పులు జరిపారు. నరసయ్య పంతులు డ్రైవర్ కు గాయాలయ్యాయని చెబుతున్నారు. కాల్పులు జరిపి బెదిరింపులకు గురిచేసి కారులో ఉన్న 43 లక్షలు తీసుకుని ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఇద్దరూ ముఖానికి మాస్క్ లు వేసుకున్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

