Sun Apr 13 2025 04:02:54 GMT+0000 (Coordinated Universal Time)
NIA : ఎన్ఐఏ సోదాలు .. కలకలం
దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. 32 ప్రాంతాల్లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ దాడులు నిర్వహిస్తుంది

దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హర్యానాతో పాటు పంజాబ్ రాష్ట్రంలోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్ఐఏ సోదాలతో కలకలం రేగుతుంది.
హత్యకేసులో...
హర్యానాలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిచారు. వీళ్లంతా సిద్దూ మూసే వాలా హత్య కేసులో నిందితులు కావడం గమనార్హం. బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వారిని విచారించే పనిలో ఎన్ఐఏ అధికారులున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story