Tue Mar 18 2025 14:35:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తాడిపత్రిలో భారీగా నగదు పట్టివేత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1.31 కోట్ల రూపాయలను షేక్ మస్తాన్ వలి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే తాడిపత్రికి చెందిన మస్తాన్ వలి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానస్పదంగా మస్తాన్ వలితో పాటు ఇద్దరు మహిళలు కనిపించడంతో వారిని సోదాలు చేయగా ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
బస్టాండ్ వద్ద...
వారివద్ద ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఈ నగదును ఎందుకు? ఎక్కడకు తీసుకెళుతున్నారో వాళ్లు చెప్పడం లేదని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురినీ తాడిపత్రి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story