Mon Dec 15 2025 02:06:29 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడక్కడే ముగ్గురు మృతి చెందారు

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వ్యాన్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు.
కొవ్వూరుకు చెందిన వారుగా...
మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు ప్రస్తుతం కేజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణం మాత్రం తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

