Tue Apr 01 2025 17:09:40 GMT+0000 (Coordinated Universal Time)
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. రాయచోటి మండలం కొత్తపేటలో ఈ ఘటన జరిగింది. కొత్తపేటలోని తొగట వీధిలో రమాదేవి తన ఇద్దరుపిల్లలతో నివాసముంటున్నారు. ఆమె భర్త కువైట్ కు మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వెళ్లారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో రమాదేవి, ఇద్దరు పిల్లలు మనోహర్, మన్విత మృతి చెందారు.
లోతైన దర్యాప్తు...
అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యా? లేక కాకతాళీయంగా జరిగిన ఘటనా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీ కెమెరాల పుటేజీ ని స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story