Sat Mar 29 2025 09:03:58 GMT+0000 (Coordinated Universal Time)
నీటి గుంతలో పడి బాలుడి మృతి
హైదరాబాద్లో మరో విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ఈ ఘటన జరిగింది

హైదరాబాద్లో మరో విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులపై నీళ్లు నిలిచాయి. దీంతో అటు వచ్చిన ఆరేళ్ల బాలుడు అందులో పడి మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.
హైదరాబాద్లో విషాదం...
బాలుడి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగించడంతో బాలుడి మృతదేహం లభించింది. నీటి గుంత వద్ద ఆడుకుంటున్న బాలుడు మృతి చెందినట్లు తెలిసింది. ఒక భవనం దగ్గర గుంతను తవ్వి వదిలేశారు. అందులో వర్షపు నీళ్లు నిలవడంతో బాలుడు ఆడుకుంటుండగా పడి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story