Mon Dec 15 2025 03:55:42 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ సనత్ నగర్ లో దారుణం.. మహిళను గదిలో బంధించి మూడ్రోజులుగా..
మొత్తం నలుగురూ బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడ్రోజుల పాటు మహిళపై అత్యాచారాలకు పాల్పడటంతో..

విజయవాడలో ఓ మహిళపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నలుగురు వ్యక్తులు ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతరాత్రి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ దారుణం వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలిపనులు చేసుకునే ఓ మహిళను.. అదే ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి.. డిసెంబర్ 17న ఆమెను కానూరు సనత్ నగర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెకు అక్కడ నిర్బంధించి, తన స్నేహితులకు సమాచారమిచ్చాడు.
మొత్తం నలుగురూ బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడ్రోజుల పాటు మహిళపై అత్యాచారాలకు పాల్పడటంతో.. ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు చేరగా.. వైద్యులు ఆమెను పరీక్షించి గతరాత్రి పెనమలూరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి వెళ్లిన పోలీసులు.. బాధితురాలితో మాట్లాడి అసలేం జరిగిందో వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story

