Wed Mar 26 2025 17:07:20 GMT+0000 (Coordinated Universal Time)
Drones: అందుకు నో పర్మిషన్.. దయచేసి దరఖాస్తులు తీసుకుని రాకండి
హైదరాబాద్ లో నిమజ్జనం సమయంలో కెమెరా-మౌంటెడ్ డ్రోన్లను

హైదరాబాద్ లో నిమజ్జనం సమయంలో కెమెరా-మౌంటెడ్ డ్రోన్లను ఉపయోగించి గణేష్ ఉత్సవాలను కవర్ చేయాలని వివిధ మీడియా సంస్థలు, ఆన్లైన్ కంటెంట్ సృష్టికర్తలు కోరగా.. హైదరాబాద్ నగర పోలీసులు తిరస్కరించారు. భద్రత, గోప్యతా సమస్యలే అనుమతి నిరాకరణకు కారణమని అధికారులు తెలిపారు. గణేష్ ఉత్సవాలను డ్రోన్లతో కాకుండా సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి కవర్ చేయాలని పోలీసులు మీడియా సిబ్బందికి సూచించారు. డ్రోన్ అనుమతుల కోసం దరఖాస్తులను సమర్పించవద్దని న్యూస్ ఛానెల్లు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు సూచించారు.
సెప్టెంబర్ 17న ఘనంగా గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఖైరతాబాద్ గణేష్ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా పేరు సంపాదించింది. ఈ విగ్రహాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వినాయక చతుర్థి పదకొండవ రోజున హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా నిర్వహించేందుకు నగర పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. విగ్రహ నిమజ్జనం సందర్భంగా పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Next Story