Mon Feb 03 2025 16:45:32 GMT+0000 (Coordinated Universal Time)
క్రిస్మస్ వేడుకలకు వెళుతుండగా ప్రమాదం... 38 మంది మృతి
కాంగో నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు
కాంగో నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు. మరొక వంద మందికి పైగా గల్లంతయినట్లు తెలిసింది. కాంగోలోని బుసీరా నదిలో పడవ బోల్తాపడింది. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఎంత మంది బతుకుతారన్నది ఇంకా తెలియలేదని అధికారులు చెబుతున్నారు.
సామర్థ్యానికి మించి...
అయితే పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంవల్లనే పడవ బోల్తా పడిందని చెబుతున్నారు. పడవ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు నాలుగు వందల మంది వరకూ ప్రయాణికులున్నారు. వీరంతా క్రిస్మస్ వేడుకలకు సొంతూళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతయిన వారిలో కేవలం 20 మందిని మాత్రమే రక్షించగలిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. సిబ్బంది సరైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇంతటి ఘోర విపత్తు సంభవించిందని తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story