Sun Dec 14 2025 23:29:59 GMT+0000 (Coordinated Universal Time)
ఊహించని విషాదం.. 48 ఏళ్ల వయసులోనే నటుడు మృతి
నటుడు వికాస్ సేథి

బాలీవుడ్ నటుడు వికాస్ సేథి కన్నుమూశాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’లో రాబీ పాత్రను పోషించిన నటుడు వికాస్ 48 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. నటుడు నిద్రలో గుండెపోటుతో మరణించినట్లు నివేదించారు. అతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ముంబైలోని జుహు ప్రాంతంలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు.
వికాస్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కహీన్ తో హోగా' వంటి ప్రసిద్ధ సీరియల్స్ లో కూడా నటించాడు. రాబీ డిప్రెషన్లో ఉన్నాడని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని నివేదించారు. 2021లో, అతను తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతని భార్య జాన్వి, వారికి కవలలు ఉన్నారు. నటుడు చివరిసారిగా తెలుగు సినిమా "ఇస్మార్ట్ శంకర్" ద్వారా వెండి తెరపై కనిపించాడు. ఈ సినిమాలో ధరమ్ పాత్రను పోషించాడు.
Next Story

