Sun Dec 14 2025 01:42:58 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు అలెర్ట్...ఎన్నిఉద్యోగాలో.. రేపు ఆఖరి గడువు
నిరుద్యోగులకు అలెర్ట్. 32,438 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి రేపు ఆఖరి గడువు

నిరుద్యోగులకు అలెర్ట్. 32,438 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి రేపు ఆఖరి గడువు. రైల్వే శాఖ గ్రూపు డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. నిజానికి గత నెల 22వ తేదీనే గడువు ముగిసింది. అయితే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు మరో ఏడు రోజులు పొడగించింది.
మరిన్ని వివరాలకు...
మార్చి 4 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకూ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పరీక్షకు హాజరవ్వాలంటే అర్హత పదో తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మాత్రమే. అయితే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు వయోపరిమితిలోనూ సడలింపు ఉంటుంది. సీబీటీ, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. మరిన్ని వివరాలకు http://www.rrbapply.gov.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు.
Next Story

