Sat Apr 05 2025 23:00:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : శరద్ పవార్ కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్ వర్గానికి ఝలక్ ఇచ్చింది.

కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్ వర్గానికి ఝలక్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శరద్ పవార్ వర్గానికి గుర్తు, పార్టీ తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అజిత్ పవార్ వర్గానికి అసలైన ఎన్సీపీ అని చెప్పింది. గడియారం గుర్తు కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
పవార్ వర్గానికే...
అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి శివసేన, బీజేపీతో కలసిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ వర్గానికి చెందిన వారిని మంత్రివర్గంలో ఏక్నాధ్ షిండే చోటు కూడా కల్పించారు.
Next Story