Fri Apr 11 2025 00:01:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ముఖ్యమంత్రికి కోర్టు సమన్లు.. ఈసారి హాజరు కాక తప్పదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో విచారణ జరిపేందుకు ఈడీ ఐదు సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు.
తమ నోటీసులకు...
దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తాము ఇచ్చిన నోటీసులను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని, విచారణకు హాజరు కాకపోవడంతో ఈ కేసుల్లో విచారణ ముందుకు సాగడం లేదని పిటీషన్ లో పేర్కొంది. దీనిపై విచారించిన న్యాయస్థానం కేజ్రీవాల్ కు ఆదేశాలు జారీ చేసింది.
Next Story