Wed Apr 16 2025 18:40:07 GMT+0000 (Coordinated Universal Time)
నిరాడంబరంగా తేజస్వి ప్రేమ వివాహం
మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం నిరాడంబరంగా జరిగింది.

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివాహానికి తక్కువ మంది అతిధులు హాజరయ్యారు. ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హో ని తేజస్వి యాదవ్ పరిణయమాడారు. కరోనా కారణంగా అత్యంత నిరాడంబరంగా వివాహాన్ని జరపాలని పెద్దలు నిశ్చయించారు.
యాభై మంది...
ఈ వివాహానికి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. కేవలం యాభై మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారని తెలిపారు. తేజస్వి యాదవ్, రాచెల్ గాడిన్హో ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.
Next Story