Tue Mar 25 2025 18:31:47 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ సిటిజన్లకు రైల్వే మంత్రి షాక్
. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీలను పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

సీనియర్ సిటిజన్లకు రైల్వే మంత్రి షాక్ ఇచ్చారు. రైల్వేలో రాయితీలను పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పార్లమెంటులో ఆయన సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పట్లో రాయితీలు ఇవ్వలేమని ఆయన చెప్పారు.
నష్టాలో ఉన్నాయని....
రైల్వేలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నాయని, జీతాలు, పింఛన్లు భారంగా మారాయని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. సీనియర్ సిటిజన్ల రాయితీని కరోనా సమయంలో రద్దు చేశారు. దానిని పునరుద్ధరించాలన్న డిమాండ్ వినపడుతుంది. అయితే రైల్వే ఎదుర్కొంటున్న నష్టాల నేపథ్యంలో రాయితీల పునరుద్ధరణ సాధ్యం కాదని అశ్వని వైష్ణవ్ తేల్చి చెప్పారు.
Next Story