Sun Mar 30 2025 14:21:43 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : న్యూజిలాండ్ తో తొలి టెస్ట్లో భారత్ ఓటమి
బెంగళూరు టెస్ట్లో ఇండియా ఓటమి పాలయింది. న్యూజిలాండ్ విజయం సాధించింది

బెంగళూరు టెస్ట్లో ఇండియా ఓటమి పాలయింది. న్యూజిలాండ్ విజయం సాధించింది. 107 పరుగుల లక్ష్యాన్ని లంచ్ బ్రేక్ కు ముందే ఈ స్కోరును ఛేదించింది. దీంతో బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్లో న్యూజిలాండ్ విక్టరీ కొట్టింది. భారత్ తో న్యూజిలాండ్ ఆడనున్న మూడు మ్యాచ్ లలో ఇప్పటికే ఒకటి గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది.
107 పరుగుల లక్ష్యాన్ని...
నిన్ననే న్యూజిలాండ్ విజయం ఖాయమైంది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ అధిగమించింది. ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ భారత్ పై విజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ, రిషబ్ పంత్ 99 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
Next Story