Mon Dec 15 2025 04:14:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆగ్రహంతో మద్యం షాపులు ధ్వంసం చేసి స్టాక్ను ఎత్తుకెళ్లిన మహిళలు
మద్యం ధరలు అధికంగా విక్రయిస్తుండటంతో మహిళలు మద్యం దుకాణాలపై దాడులకు దిగారు

మద్యం ధరలు అధికంగా విక్రయిస్తుండటంతో మహిళలు మద్యం దుకాణాలపై దాడులకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో ఈ ఘటన జరిగింది. మహిళలు ఆ గ్రామంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాలపై దాడులకు దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. మద్యం దుకాణాలు ఇక్కడ పెట్టారని కాదు. అధిక ధరలకు మద్యం ధరలను విక్రయిస్తున్నారని ఈ దాడికి దిగారు.
అధిక ధరలు...
మద్యం బాటిల్ పై ఇరవై నుంచి ముప్ఫయి రూపాయలు అధికంగా అమ్ముతున్నారని తెలుసుకున్న మహిళలు తమ భర్తల జేబులు లూటీ చేస్తున్నారని భావించి ఈ దాడులకు దిగారు. ప్రముఖ బ్రాండ్లు కాకుండా బెల్ట్ షాపుల్లోనే మద్యాన్ని అమ్ముతున్నారని వారు ఆరోపించారు. దీంతో నాలుగు మద్యం దుకాణాలపై దాడి చేసి అందులో ఉన్న మద్యం సీసాలను ఎత్తుకుపోయారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

