Mon Apr 21 2025 16:28:48 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేటి నుంచి మళ్లీ ప్రచారంలోకి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం పై నిషేధం నేటితో ముగిసింది. దీంతో నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం పై నిషేధం నేటితో ముగిసింది. దీంతో నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సిరిసిల్లలో జరిగిన సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
నిషేధం ముగియడంతో...
నిషేధం గడువు నేటితో ముగియడంతో నేడు కేసీఆర్ తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. గత నెల 24వ తేదీన బస్సు యాత్రతో వరసగా పార్లమెంటు నియోజకవర్గాలుగా పర్యటిస్తున్న కేసీఆర్ రాత్రి వేళ అక్కడే బస చేస్తూ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగే సభలో కేసీఆర్ పాల్గొంటారని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story