Mon Dec 15 2025 00:27:07 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి బండి సంజయ్ పాదయాత్ర
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నాలుగో విడత జరగనున్న ఈ యాత్ర పది రోజుల పాటు సాగనుంది. కుత్బుల్లాపూర్ నుంచి బయలు దేరిన ఈ యత్ర 115.3 కిలోమీటర్ల మేర సాగనుంది. ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మధ్యలో ఆగుతూ బండి సంజయ్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో...
ఇప్పటి వరకూ మూడు విడతల్లో ప్రజాసంగ్రామ పాదయాత్ర జరిగింది. మొత్తం 1,128 కిలోమీటర్ల మేర ఈ యాత్ర పూర్తయింది. నాలుగో విడత పాదయాత్ర 48 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సాగనుంది. రోజుకు పది నుంచి పదకొండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. మధ్యలో ఈ నెల 17వ తేదీన యాత్రకు విరామం ప్రకటించనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ షా హాజరుకానుండటంతో ఆరోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిస్తారు. ఈనెల 22న పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నాలుగో విడత పాదయాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.
Next Story

