Mon Mar 24 2025 19:39:01 GMT+0000 (Coordinated Universal Time)
చెరువులోనే భవనం.. వీకెండ్ లో సేదతీరటానికేనట.. కూల్చేశారుగా?
కొండాపూర్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీలో చెరువు మధ్యలో ఉన్న భవనాన్ని నిర్మించుకున్నారు. దానినిఅధికారులు కూల్చేశారు

కొండాపూర్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీలో చెరువు మధ్యలో ఉన్న భవనాన్ని నిర్మించుకున్నారు. మధిర గ్రామం కుతుబ్శాయిపేట్ గ్రామంలోనిచెరువులో నిర్మించిన ఈ అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కలసి ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. నాలుగు అంతస్థుల భవనాన్ని చెరువులో నిర్మించుకుని వీకెండ్ లో వచ్చి యజమాని ఇక్కడ ఉంటారని తెలిసింది. అయితే ఈ నాలుగు అంతస్థుల భవనాన్ని అధికారులు బాంబులతో కూల్చివేశారు.
2012లో ఈ భవనాన్ని..
పన్నెండేళ్ల క్రితం అంటే 2012లో ఈ భవన నిర్మాణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు చెప్పారు.అయితే బాంబులతో భవనాన్ని పేల్చడంతో ఈ సందర్భంగా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్కాపురం పెద్దచెరువు ఎఫ్టీఎస్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. భవనం లోపలకి వెళ్లేందుకు మెట్ల మార్గాన్ని కూడా నిర్మించుకున్నాడు ఈ ఘనుడు.
Next Story