Mon Mar 31 2025 04:28:52 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి పాఠశాలల ప్రారంభం.. ఎంసెట్ కూడా
తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. నేడు ఎంసెట్ పరీక్ష కూడా జరగనుంది

తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు, కళాశాలలు నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. గత వారం 11వ తేదీన భారీ వర్షాలు కురవడం, వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరిగి సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వారం రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
నేడు ఎంసెట్ పరీక్ష...
మరోవైపు నేడు తెలంగాణలో ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్ష ఈరోజు, రేపు జరగనుంది. భారీ వర్షాల కారణంగా అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. ఈరోజు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరుకానున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Next Story