Mon Apr 21 2025 14:11:09 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ప్రముఖ హీరో విజయదేవర కొండను విచారించనున్నారు

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ప్రముఖ హీరో విజయదేవర కొండను విచారించనున్నారు. లైగర్ సినిమాలో పెట్టుబడులు ఎవరు పెట్టారన్న దానిపై ఆరా తీయనున్నారు. రాజకీయ నేతలతో పాటు విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
రాజకీయ నేతల....
ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజకీయ నేతల అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు అనుమానాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూరి జగన్నాథ్, ఛార్మిలను ఈడీ అధికారులు విచారించారు.
Next Story