Wed Apr 23 2025 22:37:58 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీల విషయంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపా ధ్యాయ బదిలీల ప్రక్రి యలో భాగంగా మల్టీ జోన్-2లోని ఉపాధ్యాయు లు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుందని తెలిసింది. ఒకే చోట కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునేందుకు...
దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రెండ్ రోజులు అవ కాశం ఇచ్చింది.కాగా, మల్టీ జోన్-2 పరిధిలోని 14 జిల్లాల్లో ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాను ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరింత మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలు దొరికినట్లయంది.
Next Story