Tue Mar 11 2025 06:26:50 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల ను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల ను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి బాధ్యతలను అప్పగించింది. మూసీ డెవలెప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గా దానకిశోర్ ను నియమించింది. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా ఛాహత్ భాజ్ పేయ్ ను నియమించింది.
ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు...
హైదరాబాద్ అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాస్తవ, హెచ్సీఎల్ ఎండగా సర్ఫరాజ్ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Next Story