Wed Apr 09 2025 01:07:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ అభ్యర్థి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈరోజు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. గుజ్జుల ప్రేమందర్ రెడ్డి పేరును పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఆయన నేడు నామినేషన్ దాఖలు చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా...
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న పేరును, బీఆర్ఎస్ ఏనుగుల రవీందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరు ఖరారయింది. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
Next Story