Thu Apr 10 2025 15:22:58 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో రిలీఫ్ దక్కింది. స్మితా సబర్వాల్ పై వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. స్మితా సబర్వాల్ పై వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. స్మితా సబర్వాల్ ఐఏఎస్ సెలక్షన్స్ పై దివ్యాంగుల విషయంలో చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఆమె దివ్యాంగులు ఐఏఎస్ ను ఎంపిక చేయడం ఎందుకని ఎక్స్ లో ప్రశ్నించారు.
దివ్యాంగులపై...
అత్యవసర పనుల్లో వారు విధుల్లో పాల్గొనలేరని స్మితా సబర్వాల్ అన్నారు. అయితే దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దివ్యాంగులను మానసికంగా దెబ్బతీస్తుందా చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరారు. అయితే హైకోర్టు మాత్రమ స్మితా సబర్వాల్ పై వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమెకు ఊరట దక్కింది.
Next Story