Wed Apr 09 2025 17:21:33 GMT+0000 (Coordinated Universal Time)
రేపటికి వాయిదా
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణను రేపటికి వాయిదా వేసింది

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు విచారణ జరపాలని అవినాష్ రెడ్డి తరుపున న్యాయవాది కోరారు. ఈరోజు జాబితాలో లేని పిటీషన్లపై విచారణ చేపట్టలేమని న్యాయస్థానం తెలిపింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో విచారణ జరుపుతామని తెలిపింది.
ఇరువురి తరుపున...
రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డి, సునీత తరుపున వాదనలు వినేందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీంతో రేపటికి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ వాయిదా పడిందని న్యాయవాదులు చెబుతున్నారు.
Next Story