Sun Dec 14 2025 23:29:00 GMT+0000 (Coordinated Universal Time)
మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వస్తానంటున్నారు : దానం
తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పై దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కేసీఆర్ విధానాలే...
మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నారని దానం నాగేందర్ తెలిపారు. కేసీఆర్ విధానాలే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలు, నిర్ణయాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఎవరి వత్తిడితో కాదని ఆయన తెలిపారు.ఎవరెవరు వస్తున్నారో కూడా ఆయన మీడియాకు పేర్లతో సహా చెప్పారు.
Next Story

