Sun May 05 2024 04:22:33 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత
మావోయిస్టు అగ్రనేత సావిత్రి పోలీసులకు లొంగిపోయారు
మావోయిస్టు అగ్రనేత సావిత్రి పోలీసులకు లొంగిపోయారు. కిష్టారం ఏరియా కమిటీ సెక్రటరీ సావిత్రి పోలీసుల వద్ద తనంతట తానుగా వచ్చి లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత రామన్న భార్య సావిత్రి. 1994లో మావోయిస్టులలో సావిత్రి చేరారు. ఆ ఏడాది రామన్న వివాహం చేసుకున్నారు.
రామన్న భార్యగా...
రామన్న పై నలభై లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా రామన్న ఉన్నారు. ఆయన 2019 లో గుండెపోటుతో మరణించారు. అయితే గత ఏడాది సావిత్రి కుమారుడు రంజిత్ కూడా పోలీసులకు లొంగిపోయారు. దీంతో తెలంగాణ మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
Next Story