Thu Apr 24 2025 22:49:35 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మహాధర్నా.. అందరూ తరలి రండి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా రేపు నిజామాబాద్ లో మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఉపాధి హామీ పథకం తెలంగాణలో నీరు గార్చేలా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. రైతులంతా కలసి వచ్చి ఈ మహాధర్నాకు మద్దతు తెలపాలని కవిత కోరారు.
ప్రతి జిల్లాలోనూ..
తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో మహాధర్నాలు జరుగుతాయని కవిత చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని అన్ని వర్గాల్లో చర్చ మొదలయిందని కవిత అభిప్రాయపడ్డారు. నిజమాబాద్ నగరాన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని కవిత తెలిపారు. పాత భవనాలను కూల్చి వేసి ప్రజోపయోగమైన భవనాలను నిర్మిస్తామని కవిత హామీ ఇచ్చారు.
Next Story