Fri Mar 21 2025 22:48:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రారంభమైన కవిత దీక్ష
ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష ప్రారంభించారు. కవిత దీక్షకు పద్దెనిమిది పార్టీల నేతలు సంఘీభావాన్ని ప్రకటించారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష ప్రారంభించారు. కవిత దీక్షకు పద్దెనిమిది పార్టీల నేతలు సంఘీభావాన్ని ప్రకటించారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలంటూ కవిత ఈ దీక్షను ప్రారంభించనుంది. సాయంత్రం నాలుగు గంటల సమయం వరకూ దీక్ష చేయనున్నారు.
18 పార్టీలతో కలిపి...
ఈ దీక్షకు వామపక్ష పార్టీలతో పాటు దేశంలోని అనేక పార్టీలు మద్దతు పలికాయి. వెంటనే పార్లమెంటులో మహిళ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలంటూ కవిత దీక్ష చేపట్టారు. తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా ఢిల్లీకి వెళ్లి ఈరోజు కవిత దీక్షలో పాల్గొననున్నారు.
Next Story