Mon Dec 15 2025 00:23:28 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ప్రభుత్వం దీపావళికి ఉద్యోగులకు గుడ్ న్యూస్... బోనస్ ఒక్కొక్కరికి లక్ష వరకూ
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఉద్యోగులకు సుమారు లక్ష రూపాయల బోనస్ ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఉద్యోగులకు సుమారు లక్ష రూపాయల బోనస్ ప్రకటించింది. ఈ మేరకు నిధులను కూడా విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికుల కోసం దీపావళికి శుభవార్త అందించారు. ఇప్పటికే దసరాకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం దీపావళికి కూడా ప్రకటించడం విశేషం. దీపావళి బోనస్ కింద 358 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.
రేపు ఖాతాలో జమ...
రేపు ప్రతి కార్మికుని అకౌంట్ లో 93,750 రూపాయలు బోనస్ మొత్తం జమ అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మొత్తం నలభై రెండు వేల మంది కార్మికులు ఈ బోనస్ అందుకోనున్నారు. నిజంగా ప్రభుత్వ ప్రకటనతో సింగరేణి కార్మికుల ఇళ్లలో ముందే దీపావళి వచ్చినట్లయింది. దసరా బోనస్ గా గత నెలలో ఒక్కొక్కరికీ 1.90 లక్షల రూపాయలు అందచేసింది. దీంతో రెండు నెలల్లోనే ఒక్కొక్క కార్మికుడికి బోనస్ కింద దాదాపు మూడు లక్షల రూపాయలు బోనస్ ప్రకటించినట్లయింది.
Next Story

