Sat Apr 27 2024 15:19:27 GMT+0000 (Coordinated Universal Time)
గద్దర్ సమాధి వద్ద నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల
ప్రజా గాయకుడు గద్దర్ మృతి చెందడం తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమ నేతలు కోల్పోయిందనే చెప్పాలి. తెలంగాణ
ప్రజా గాయకుడు గద్దర్ మృతి చెందడం తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమ నేతలు కోల్పోయిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం గద్దర్ తన పాటలతో యువతల్లో ఉత్తేజాన్ని నింపారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా కీలక పాత్ర పోషించారు. అనారోగ్యం మృతి చెందిన ఆయనకు ప్రముఖులు,రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రజా గాయకుడు గద్దర్ సమాధి వద్ద వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను కలిసిన షర్మిల రెడ్డి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఒక మంచి గాయకుడు, ఉద్యమ నేతలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఆయన చేసిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు.
Next Story