Fri Mar 14 2025 01:44:46 GMT+0000 (Coordinated Universal Time)
అమూల్ తో ఏపీ అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమూల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా మహిళల జీవితంలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం ద్వారా ప్రభుత్వ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమూల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా మహిళల జీవితంలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం ద్వారా ప్రభుత్వ [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమూల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా మహిళల జీవితంలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం ద్వారా ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచిరోజులు రానున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా నిలుస్తుందని జగన్ అన్నారు. ఈ ఒప్పందం ద్వారా పాడిరైతులకు మంచి ధర లభించనుంది. తక్కువ ధరకు నాణ్యమైన పాల ఉత్పత్తులు లభిస్తాయని చెప్పారు. ఈ ఒప్పందాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ లు పాల్గొన్నారు.
Next Story