Tue Mar 11 2025 05:10:08 GMT+0000 (Coordinated Universal Time)
11 రోజులు... 20 కిలోలు..!

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పటేళ్ల నేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన 11 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్ష ప్రారంభించే సమయంలో హార్ధిక్ బరువు 78 ఉండగా ఇప్పుడు 20 కిలోలు తగ్గిందని వైద్యులు అంటున్నారు. పటేళ్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని హార్ధిక్ డిమాండ్ చేస్తున్నారు. హార్ధిక్ ఆరోగ్యం క్షిణిస్తుండటంతో గుజరాత్ లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. హార్ధిక్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు దీక్ష స్థలి వద్ద ప్రత్యేకంగా ‘ఐసీయూ ఆన్ వీల్స్’ ఏర్పాటు చేశారు. ఇక హార్ధిక్ నిన్న తన వీలునామా కూడా రాసిన విషయం తెలిసిందే.
Next Story