Mon Dec 15 2025 03:49:11 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ అభ్యర్థి ఇంట్లో నగదు స్వాధీనం
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఇంట్లో 18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడింది. దుబ్బాక [more]
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఇంట్లో 18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడింది. దుబ్బాక [more]

దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఇంట్లో 18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడింది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహించగా రఘునందనరావుకు చెందిన హైదరాబాద్, సంగారెడ్డిలో ఉన్న ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును బీజేపీ కార్యకర్తలు తీసుకుని పారిపోయారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనిఖీలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు.
Next Story

