Fri Mar 14 2025 08:56:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పల్నాడులో టెన్షన్ టెన్షన్
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతితో పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతితో పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు [more]

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతితో పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను భారీగా మొహరించారు. కోడెల మృతితో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా పల్నాడు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కోడెల మృతిని ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. నరసరావుపేట, సత్తెన పల్లి నియోజకవర్గాల్లో పోలీసులు వీధుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 144వ సెక్షన్ ను విధించారు.
Next Story