Fri Apr 11 2025 19:34:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన
తెలంగాణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ములుగుజిల్లాలోని తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి చర్చించనున్నారు.సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
దత్తత తీసుకున్న...
ఈ సందర్భంగా కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తర్వాత గ్రామస్థులతో గవర్నర్ ప్రత్యేకంగా సమావేశమై ఆ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై చర్చిస్తారు. తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మదర్శించుకోనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story