Delhi : ఢిల్లీలో భారీ పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల భారీ పేలుడు జరిగింది

Update: 2024-10-20 06:19 GMT

ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. దేశ రాజధానిలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల ఈ పేలుడు జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకున్నారు. క్రైమ్, ఎఫ్‌ఎస్ఎల్ బృందాలు, బాంబు డిస్పోజల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

పాఠశాల సమీపంలో...
ఈరోజు ఉదయం 7:47 గంటలకు సీఆర్పీఎఫ్‌ పాఠశాల సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పాఠశాల గోడ కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కారణంగా పాఠశాల సమీపంలో నిలిపి ఉంచిన కార్ల అద్దాలు పగిలిపోవడంతో పాటు ఆ ప్రాంతంలోని దుకాణాలు దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Tags:    

Similar News